
బీబీపేట బస్టాండ్లో తాగుబోతుల వీరంగం
బీబీపేట: మద్యం మత్తులో ఇద్దరు అన్నాదమ్ముళ్లు వీరంగం సృష్టించిన ఘటన బీబీపేట బస్టాండ్లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రాంరెడ్డిపల్లికి చెందిన గణేశ్, రమేశ్కు గ్రామంలో ఎలాంటి స్థలం లేకపోవడంతో మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో తల్లితో కలిసి ఉంటున్నారు. వారి తల్లి భిక్షాటన చేస్తూ అన్నం పెడుతోంది. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న వీరు బస్టాండ్లో ఘర్షణ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. ఈ ఘటన చూసిన ప్రయాణికులు భయంతో కొద్ది దూరం పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. నిత్యం మద్యంలో బస్టాండ్కు వచ్చే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిని వేరే చోటుకు తరలించాలని స్థానికులు కోరారు.
మద్యం మత్తులో ఇద్దరు
అన్నాదమ్ముళ్ల ఘర్షణ
ప్రయాణికులకు ఇక్కట్లు

బీబీపేట బస్టాండ్లో తాగుబోతుల వీరంగం