
నిరుపయోగంగా కంపోస్ట్ షెడ్
మద్నూర్(జుక్కల్): ప్రభుత్వం తడి చెత్త, పొడి చెత్త కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంపోస్ట్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. కంపోస్ట్ షెడ్లను పంచాయతీ సిబ్బంది వాడకపోవడంతో గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శమిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో అవి వృథాగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గుంతలయంగా రోడ్డు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామం నుంచి దేమికలాన్కు వెళ్లే రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత 10 ఏళ్ల క్రితం వేసిన తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతల మయంగా మారింది. ప్రతి రోజు ఈ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు గుండా మండలంలోని కరడ్పల్లి, కన్కల్, దేమికలాన్ గ్రామాలకు చెందిన ప్రజలు ఎర్రాపహడ్కు వెళ్తుంటారు. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నారు.

నిరుపయోగంగా కంపోస్ట్ షెడ్