
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
లింగంపేట: మండలంలోని పొల్కంపేట శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను బుధవారం సాయంత్రం పట్టుకొని సీజ్ చేసినట్లు ప్రొబేషనరీ ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. ఎక్కపల్లి గ్రామానికి చెందిన నీల శంకర్, ల్యాగల గోపాల్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా పట్టున్నట్లు పేర్కొన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్లో జైలు శిక్ష
మోపాల్: మండల కేంద్రంలో ఈనెల 25న నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో మద్యం సేవించి వాహనం నడిపిన కులాస్పూర్ తండాకు చెందిన మూడ్ గణేశ్కు రెండోరోజుల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నూర్జహాన్ బేగం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ బుధవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఎస్సై సూచించారు.