
నాలుగేళ్లకే నూరేళ్లు..
మాచారెడ్డి: ఇంటి బయట ఆడుకుంటు న్న నాలుగేళ్ల బాలుడు నీటి గుంతలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన భూమ శ్రీలత–సందీప్ల రెండో కుమారుడైన యశ్వంత్(4)ను రెండు రోజుల క్రితం అమ్మమ్మ బరిగె నర్సవ్వ కొత్తపల్లెకు తీసుకొచ్చింది. బుధవారం సాయంత్రం బాలుడు ఆడుకుంటూ నీటి గుంతలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని గుండెలవిసేలా విలపించారు. కొడుకా నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ ఆ తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
● అమ్మమ్మ ఇంటికి వచ్చి
కానరాని లోకాలకు..
● కొత్తపల్లిలో నీటి గుంతలో పడి బాలుడి మృతి