విభేదాలు విడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలి | - | Sakshi
Sakshi News home page

విభేదాలు విడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలి

May 29 2025 7:27 AM | Updated on May 29 2025 7:27 AM

విభేదాలు విడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలి

విభేదాలు విడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలి

బాన్సువాడ : విభేదాలు విడిచిపెట్టి కార్యకర్తలందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ శ్రీనివాస గార్డెన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలోపు అధి ష్టానం నిర్ణయం మేరకు గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ కార్యవర్గాలను ఎన్నుకుంటామన్నారు. 2017 కంటే ముందు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కార్యకర్తలకే గ్రామ, మండల అధ్యక్ష పదవులు కేటాయించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ భరతం పట్టాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌ అన్నారు. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరాకే తెలంగాణ ఉద్యమం ఉధ్రుతమైందని మాజీ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బాన్సువాడకు వచ్చినప్పుడు పోచారం శని పుత్రుడని విమర్శలు చేయడంపై మండిపడ్డారు. పోచారంను విమర్శిస్తే నాలుక చీరేస్తానమని ఆగ్రహాం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల అబ్జార్వర్లు వేణుగోపాల్‌యాదవ్‌, సత్యనారాయణగౌడ్‌, నాయకులు అంబర్‌సింగ్‌, అలిబిన్‌అబ్దుల్లా, రత్నకుమార్‌, ఖలేక్‌, అసద్‌, కూనీపూర్‌రాజిరెడ్డి, శంకర్‌, సురేష్‌బాబా, మన్సూర్‌, మదుసూదన్‌రెడ్డి, బిట్ల సురేష్‌, దాసరి శ్రీనివాస్‌, ఎజాస్‌, శ్రీనివాస్‌గౌడ్‌, అజీం, అప్రోజ్‌ తదితరులు ఉన్నారు.

పాత కాంగ్రెస్‌ కార్యకర్తలకే పదవులు

నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి

కాంగ్రెస్‌ కార్యకర్తలు అన్నదమ్ములా మెదలాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తాచాటాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కై లాస్‌ శ్రీనివాస్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, గ్రామాల్లో పాత, కొత్త కాంగ్రెస్‌ కార్యకర్తలు అన్నదమ్ముల మెదలాలని సూచించారు.

–కై లాస్‌ శ్రీనివాస్‌ జిల్లా అధ్యక్షులు కామారెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement