
ఆయుష్ ఆస్పత్రుల వద్ద హరిత యోగా కార్యక్రమాలు
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయుష్ డీపీఎం ఆకుల శ్రీకాంత్ అన్నారు. బుధవారం స్థానిక ఎన్జీవోస్ కాలనీలోని ఆయుష్ ఆస్పత్రి వద్ద హరిత యోగా కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడారు. వైద్యులు వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్యులు గుండేల దేవయ్య, మల్లికా జనైడీ, సిబ్బంది రాజలక్ష్మి, సాయినీల, లింగామూర్తి తదితరులు పాల్గొన్నారు.
రక్తదానంపై అపోహలు
తొలగించుకోవాలి
బాన్సువాడ రూరల్: రక్తదానం చేయడంపై ఉన్న అపోహాలను తొ లగించుకుని, ప్రతి 3 నెలలకు ఓసారి యువకులు రక్తదానం చేయాలని ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ అన్నారు. బుధవారం బాన్సువాడలోని బ్లడ్బ్యాంకులో ఫౌండేషన్ నా యకులు చేసిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొ ని మాట్లాడారు.ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
యువకుల రక్తదానం
కామారెడ్డి అర్బన్: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీతో బాధపడుతున్న రహేనా బేగం అనే మహిళకు తెల్లరక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ ప్లేట్ లెట్లు అవసరం కాగా లింగంపేట్కు చెందిన రాజు, రమేష్లు స్పందించి మానవత ధృక్పథంతో రక్తదానం చేశారని రెడ్క్రాస్ సోసైటీ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. సకాలంలో ఏ పాజిటివ్ రక్తం ఇవ్వడంతో ప్లేట్లెట్లు ఎక్కించారని, ప్రాణాపాయం తప్పిందన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని విజయవంతం చేయాలి
ఎల్లారెడ్డి: భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సమావేశానికి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు హాజరు కావాలన్నారు.

ఆయుష్ ఆస్పత్రుల వద్ద హరిత యోగా కార్యక్రమాలు

ఆయుష్ ఆస్పత్రుల వద్ద హరిత యోగా కార్యక్రమాలు