
సేంద్రియ ఎరువుకు డిమాండ్
మద్నూర్(జుక్కల్): సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువులకు డిమాండ్ పెరగడంతో అధిక ధర పలుకుతుంది. సేంద్రియ ఎరువుల్లో మొక్కకు అవసరమైనా అనేక పోషకాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారి రాజు రైతులకు సూచిస్తున్నారు. పశువుల ఎరువులను రసాయన ఎరువులతో పోల్చి చూడగా ఏడాదికి ఒక్క గేదె నుంచి 7 టన్నుల పేడ, 2500 లీటర్ల మూత్రం వస్తుంది. ఒక గేదె పేడలో సాలీనా 27.21 కిలోల నత్రజని (55 కిలోల యూరియాతో సమానం), 13.60 కిలోల భాస్వరం (85 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్తో సమానం), 6.8 కిలోల పోటాష్ (12 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో సమానం), గేదె మూత్రంలో 29.16 కిలోల నత్రజని, 39.56 కిలోల పొటాష్, కోద్ది మొత్తంలో భాస్వరం ఉంటాయి.
ఏ పంటకై నా ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండానే పశువుల ఎరువు ఉపయోగించి దిగుబడి అధికంగా పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
లారీ కోడి ఎరువు రూ.12–14 వేలు
రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో లారీ కోడి ఎరువు రూ.12–14 వేల మధ్య ఉంది. పశువుల ఎరువు లారీకి రూ.15 వేల నుంచి 16 వేల పైగా చేరింది. గొర్రెల ఎరువు సైతం రూ.9–10 వేల వరకు ఉంది. ప్రస్తుతం పశువుల స్థానంలో ఆధునిక యంత్రాలు రావడంతో ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రతి రైతు బయటి ప్రాంతాల నుంచి తీసుకవచ్చే సేంద్రియ ఎరువులపైనే ఆధారపడడంతో డిమాండ్ ఏర్పడింది.
పొలాలకు తరలిస్తున్న రైతులు
వ్యవసాయాధికారుల సూచన