తండ్రి, కూతుళ్ల మధ్య వివాదం పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

తండ్రి, కూతుళ్ల మధ్య వివాదం పరిష్కారం

May 29 2025 7:27 AM | Updated on May 29 2025 7:27 AM

తండ్రి, కూతుళ్ల మధ్య  వివాదం పరిష్కారం

తండ్రి, కూతుళ్ల మధ్య వివాదం పరిష్కారం

బోధన్‌: పట్టణ కేంద్రంలోని దళిత వాడకు చెందిన మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుడు పరమేశ్‌ కుమార్తె వైష్టవి రెండేళ్లుగా జిల్లా కేంద్రంలోని బాల సదన్‌లో ఉంటోంది. తన తండ్రి ఆలనా, పాలన పట్టించుకోవడం లేదని బోధన్‌ పట్టణ కేంద్రంలోని మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆశ్రయించి ఆదుకోవాలని కోరింది. బుధవారం ఈ కేంద్ర నిర్వాహకులు తండ్రి, కూమార్తెను పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. తన నెలసరి వేతనంలో సగభాగం, ఉన్న ఎకరం పొలంలో సగభాగం కుమార్తెకు ఇచ్చేందుకు తండ్రి పరమేశ్‌ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్‌ వద్దకు ఇరువురిని తీసుకెళ్లగా ఇరువురి అంగీకారం మేరకు అవార్డు ప్రకటించి వారికి అందించారు. ప్రస్తుతం వైష్టవి తండ్రి మేనత్త వద్ద ఉంటోందని కేంద్ర నిర్వాహకులు, పారలీగల్‌ వలంటీర్‌ పద్మాసింగ్‌ తెలిపారు.

జీజీహెచ్‌ ఏడీగా శ్రీనివాస్‌ప్రసాద్‌

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఏడీగా శ్రీనివాస్‌ప్రసాద్‌ జిల్లాకు రానున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఏవోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్‌ ప్రసాద్‌ పదోన్నతిపై జీజీహెచ్‌ ఏడీగా రానున్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌ ఇన్‌చార్జి ఏడీగా డాక్టర్‌ రాజశేఖర్‌ విధులు నిర్వర్తిస్తున్నరు. జూన్‌ మొదటి వారంలో పూర్తిస్థాయి ఏడీ రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement