ఎల్లారెడ్డి:ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని తరగతి గదులను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసుల విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ నిజాం తదితరులున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
బాన్సువాడ రూరల్: అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని, ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కొత్తాబాది గ్రా మానికి చెందిన పలువురు దరఖాస్తుదారులు కోరారు. పాత పెంకుటిళ్లు, పూరిగుడిసెలు కూలిపోయాయని తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వెంటనే పనులు ప్రారంభించుకుంటామన్నారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, త్వర లో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు అందజేస్తా మని షావలీ, లింగయ్య, ధరావత్ గంగారాం, మంగ్యా, విజయ్కుమార్, బీబీలు తెలిపారు.
భవనం నిర్మించారు.. ప్రహరీ వదిలేశారు
బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల భవనం నిర్మించారు. ప్రహరీ నిర్మాణం వదిలేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో రూ. 6.70 కోట్ల వ్యయంతో బీర్కూర్లో బీసీ బాలుర గురుకుల పాఠశాలను నిర్మించారు. ఈ పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని వసతులతో భవనం నిర్మించారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, పందులు పాఠశాల ఆవరణలోకి వచ్చి స్వైర్య విహారం చేస్తున్నాయి. వర్షకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మైనారిటీ స్కూల్లో అన్ని వసతులు
బిచ్కుంద(జుక్కల్) : మండల కేంద్రంలోని మై నారిటీ బాలుర స్కూల్లో అన్ని సౌకర్యాలున్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బో ధన కొనసాగుతుందని ప్రిన్సిపాల్ సునీతా భండారి అన్నారు. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మైనారిటీ స్కూల్లో చేర్పించాలని కోరారు. మైనారిటీలకు 5వ తరగతిలో 37 సీట్లు,6లో 5సీట్లు,ఎస్సీ, ఓసీల సీట్లు 2 ఖాళీ ఉన్నాయి. అలాగే 8వ తరగతిలో 9సీట్లు, 9వ తరగతిలో 22 సీట్లు, 10 వ తరగతిలో 35 సీట్లు మైనారిటీలకు, ఎస్సీ 4, ఓసీ 1 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈఅవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ