
నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ కొలతలకు అనుగుణంగా, నిబంధనల మేరకు నిర్మించుకోవాలని నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తిలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇచ్చి లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందజేశారు.కార్యక్రమంలో మాల్తుమ్మెద సొసైటీ మాజీచైర్మన్ రాంచందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజీమోద్దీన్, కాంగ్రెస్ గ్రామకమిటీ అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఎంపీవో మలహరి సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని నల్లమడుగు గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని కంపోస్టు షెడ్డును పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి కంపోస్టు ఎరువు తయారు చేయాలని కార్యదర్శికి సూచించారు. ఎరువులకు పంట చేనులకు తరలించాలని సూచించారు. అలాగే నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. కార్యదర్శి ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు పరిశీలించిన ప్రత్యేక అధికారి
బిచ్కుంద(జుక్కల్) : ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావాలని మండల ప్రత్యేక అధికారి మైన్స్ పీడీ నగేశ్ అన్నారు. మంగళవారం బిచ్కుంద, హజ్గుల్, పెద్దదేవాడ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత జీపీ కార్యదర్శిపై ఉందన్నారు. ఆయన వెంట ఎంపీవో కృష్ణ ఉన్నారు.

నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి