
వేడుకలను ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేనెల 2 న జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్య అతిథి సందేశం సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే విధంగా శకటాల ప్రదర్శన, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.
టీబీ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
ఈ ఏడాది చివరికల్లా టీబీ వ్యాధి నిర్మూలన జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక వాడలు, రైస్మిల్లులు, సిమెంట్ దుకాణాల్లో పనిచేసే కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు చేయించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించాలని సూచించారు. టీబీ ఉన్న వారికి ఉచితంగా మందులు, పౌష్టికాహారం తీసుకునేందుకు సహకారంగా నెలకు రూ.500 ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరగా ఇంటింటి సర్వే ప్రారంభించాలన్నారు. టీబీ వ్యాధిని నిర్ధారించే పరీక్షా కేంద్రాలు కామారెడ్డి, ఎల్లారెడి, బాన్సువాడ, బిచ్కుంద ఆస్పత్రుల్లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, టీబీ ప్రోగ్రాం అధికారి రాధిక రాణి, ఎన్సీడీ పీవో శిరీష, డీప్యూటీ డీఎంహెచ్వో విద్య, పీఆర్, మున్సిపల్, కార్మిక, ఐకేపీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన
శకటాలను ప్రదర్శించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
యూనిఫాంలు సిద్ధం చేయాలి
దోమకొండ : పాఠశాలల పునఃప్రారంభానికి ముందే విద్యార్థులకు అందించేందుకు యూనిఫాంలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం దోమకొండలోని యూనిఫాం కుట్టు మిషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన యూనిఫామ్ల వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో స్టిచ్చింగ్ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయ ఆవరణలోని బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్ను, ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో సురేందర్, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, డీపీఎం రమేష్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఐకేసీ ఎంపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.