
సాగుకు రైతును సన్నద్ధం చేయాలి
కామారెడ్డి క్రైం : వర్షాలు పడుతున్న నేపథ్యంలో ముందస్తు సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయం తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. రైస్ మిల్లులను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల పరిహారం అందించేందుకు నివేదిక తయారు చేయాలన్నారు. వర్షాలు ముందుగా రావడంతో వ్యవసాయ శాఖ తన ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.
3 నుంచి రెవెన్యూ సదస్సులు..
వచ్చేనెల 3 నుంచి 20 వ తేదీ వరకు అన్ని మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. పైలట్ మండలాల్లో నిర్వహించిన భూభారతి సదస్సుల అనుభవాల ను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవె న్యూ సదస్సుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. వీడి యో కాన్ఫరెన్స్లో బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవోలు వీణ, ప్రభాకర్, పౌరసరఫరాలు, వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే
పీడీ యాక్ట్ నమోదు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్లో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి