
అధ్వానంగా పోచారం కాలనీ
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీ అధ్వానంగా మారింది. కాలనీలోని డ్రెయినేజీలో వ్యర్థాలు పేరుకుపోయి, మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే రోడ్ల పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

అధ్వానంగా పోచారం కాలనీ