
తండ్రి హత్య కేసులో కొడుకు రిమాండ్
లింగంపేట(ఎల్లారెడ్డి): తండ్రిని హత్య చేసిన కొడుకును రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ ఫకీరా భార్య, పిల్లలు ఉండగా రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఫకీరా ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలుపగా వారు నిరాకరించారు. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని కొడుకు దేవసోత్ ప్రకాశ్.. ఫకీరాను గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు. ఫకీరా సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ప్రొహిబిషన్ ఎస్సై రాఘవేంద్ర, ఏఎస్సై ప్రకాశ్ నాయక్, సిబ్బంది మదన్లాల్ తదితరులు పాల్గొన్నారు.