
ప్రభుత్వ బడికి ప్రహరీ నిర్మించండి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం గ్రామంలోగల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ పునర్నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జాతీయ రహదారి ఏర్పాటు పను ల్లో భాగంగా ఇటీవల గ్రామంలో నూతనంగా ని ర్మించిన డ్రెయినేజీ ద్వారా వరదనీరు రావడంతోతో పాఠశాల ప్రహరీ కూలిపోయిందన్నారు. అలాలే పాఠశాల ఆవరణలోకి వరదనీరు చేరి చెరువులా మారిందన్నారు. వెంటనే హైవే పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ పాఠశాల ప్రహరీని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో,కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందితో మాట్లా డారు. పాఠశాల ఆవరణలో నిలిచిన నీటిని జేసీబీ సహాయంతో సంస్థ సిబ్బంది తొలగింపజేశారు. ప్రహరీ నిర్మాణ విషయం తన పరిధిలో లేదని సంస్థ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు ప్రహరీ విషయమై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని హరిజనవాడలోగల ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ పూర్తిగా లేకపోవడంతో పశువులు, విష పురుగులు బడి ఆవరణలో సంచరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వంటగది కూడా లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాలలు ప్రారంభం కాకాముందే బడికి ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ బడికి ప్రహరీ నిర్మించండి