కూలిన చారిత్రక కట్టడం | - | Sakshi
Sakshi News home page

కూలిన చారిత్రక కట్టడం

May 27 2025 1:11 AM | Updated on May 27 2025 1:11 AM

కూలిన

కూలిన చారిత్రక కట్టడం

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌ గ్రామంలో నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు చారిత్రక కట్టడమైన ఏడంతస్తుల భవనం కూ లిపోయింది. ఆదివారం రాత్రి 10.30 గంటలకు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా భవనం కుప్పకూలింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన భవనం కూలిపోవడం బాధగా ఉందని ఉత్తూర్‌ లచ్చయ్య మనుమడు పాలకుర్తి శ్రీనివాస్‌ ఆవేదనను వ్యక్తం చేశాడు.

1942లో నిర్మాణం..

కుద్వాన్‌పూర్‌ నిజాం కాలంలో ఆస్థానంగా ఉండేది. గ్రామానికి చెందిన ఉత్తూర్‌ లచ్చయ్య వృత్తి రీత్యా ప్రజలకు వైద్యం చేసేవాడు. కాగా, తనకు ఉండే భవనం మరెవరికీ ఉండొద్దని ఉద్దేశంతో 1942 సంవత్సరంలో ఏడంతస్తులు నిర్మించాడు. అప్పట్లోనే హైదరాబాద్‌ సంస్థానం నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సొంతంగా కట్టడం ప్లాన్‌ చేసుకొని, డంగు సున్నాన్ని ఎడ్లతో తొక్కించి సిమెంట్‌లా తయారు చేసి ఇంటిని నిర్మించినట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లాలో ఏడంతస్తుల భవనం ఎ క్కడా లేకపోవడంతో అప్పట్లో ఈ భవనాన్ని చూ సేందుకు తరలివచ్చేవారని చెపుతారు. కాలక్రమేనా లచ్చయ్య ఇష్టంతో కట్టుకున్న ఈ భవనాన్ని కూ తురు ప్రభావతికి ఇచ్చిన కొన్ని రోజులకు కన్నుమూశాడు. కాగా, ప్రభావతి తన కుటుంబంతో ఇదే భవంతిలో నివాసం ఉండేది. కుమారులు ఇతర ప్రాంతాలకు వెళ్లగా గత పది సంవత్సరాల నుంచి ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చారు. నెల రోజుల క్రితం వరకు ఈ భవనంలో జనాలు నివసించినట్లు గ్రామస్తులు తెలిపారు.

కూలిన చారిత్రక కట్టడం1
1/1

కూలిన చారిత్రక కట్టడం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement