
చదువుకు పేదరికం అడ్డుకావొద్దు
రుద్రూర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్, రైడ్స్ గౌరవ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఉద్బోధించారు. మండల కేంద్రంలో రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ (రైడ్స్) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నెల రోజులపాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ పేదరికం చదువుకోవడానికి అడ్డం కావొద్దని, అలాంటి వారికి రైడ్స్ చేయూత అందిస్తుందన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు సహకారం అందిస్తుందని, అందుకు మా మిండ్ల రామాగౌడ్ స్మారక ట్రస్ట్ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన బో ధన్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం క ల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైడ్స్ సభ్యుల ప్రోత్సాహాన్ని వినియోగించుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించా రు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో రుద్రూర్, వర్ని ఎంఈవోలు కట్ట శ్రీనివాస్, డీ సాయిలు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావ్ దేశాయ్, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, ఇందూరు, వంశీ విద్యా సంస్థల అధినేతలు కిశోర్ కుమార్, పద్మజ, రైడ్స్ సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని
ముందుకు వెళ్లాలి
హైదరాబాద్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్