
ట్రాన్స్కో.. మేలుకో!
బిచ్కుంద: మండల కేంద్రంలోని పలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. గ్రామ పంచాయతీ వెనకనున్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మురికి నీరు నిల్వ ఉండగా.. కోర్టు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ చుట్టు పిచ్చి మొక్కలు పెరిగాయి. ఆయా ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎలాంటి రక్షణ కంచెలు లేవు. గతంలో మండలకేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి ఓ మహిళ మృతి చెందింది. మూగ జీవాలు సైతం మృత్యువాతపడుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదు. ఈ విషయాన్ని ఏఈ పవన్కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా.. కొన్ని ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించామన్నారు. జీపీ వెనక ఉన్న ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మారుస్తామని, రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ట్రాన్స్కో.. మేలుకో!