
చోరీకి పాల్పడిన వ్యక్తి..
భిక్కనూరు: పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన ఒక వ్యక్తిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన నరేష్ ట్రాక్టర్, డీసీఎం వాహనాలకు చెందిన బ్యాటరీలను చోరీ చేశాడు. అంతేకాకుండా కామారెడ్డితో పాటు మండల కేంద్రంలో పలు మోటార్ సైకిల్ దొంగతనాలు చేశాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారన్నారు. అనంతరం అతడి నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఆరు ట్రాక్టర్ డీసీఎం బ్యాటరీలు, ఒక సీసీ కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.