నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

May 25 2025 8:10 AM | Updated on May 25 2025 8:10 AM

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

బాన్సువాడ : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజురు పత్రాలను ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో 11 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజురు చేయించామని, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణలోనే బాన్సువాడ నంబర్‌ వన్‌గా నిలిచిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేసిందని బాన్సువాడ పట్టణంలో 260 మందికి, బాన్సువాడ రూరల్‌లో 353 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేశామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ నమూనాను లబ్దిదారులకు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇప్పిస్తామని, మేసీ్త్రలను కూడా తక్కువ ధరకు ఇళ్లు కట్టెలా తాపి మేసీ్త్రల యూనియన్‌ నాయకులతో మాట్లాడుతామన్నారు. ఇళ్లు మంజురు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. అనంతరం కోటగల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అడిషనల్‌ కలెక్టర్‌ చందర్‌, సీఈవో శంకర్‌, ప్రత్యేకాధికారి రాజు, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్‌

బీబీపేట/లింగంపేట : ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని బీబీపేట మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటికి ముగ్గు పోశారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్‌, కార్యదర్శి రమేష్‌ తదితరులు ఉన్నారు. లింగంపేట మండలకేంద్రంతో తో పాటు ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపీడీవో నరేష్‌ మార్కౌట్‌ ఇచ్చారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్‌, నాయకులు రాజు, నాగేష్‌, కిరణ్‌ గ్రామ పెద్దలు లబ్దిదారులు పాల్గొన్నారు.

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తిర్మన్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రమేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావేటి సాయిలు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా

ఇసుక ఇప్పిస్తాం

వ్యవసాయ సలహాదారు

పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడలో లబ్ధిదారులకు

మంజురు పత్రాల అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement