
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రంజిత్ సూచించారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీటీం, కళాజాత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఎంఈవో యోసెఫ్, ఏఎస్సై సాగర్, కళాబృందం ప్రతినిధులు, షీటీమ్ సభ్యులు పాల్గొన్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో శనివారం పోలీసులు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. షీటీం సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టెందుకు టోల్ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయాలని అన్నారు. సోషల్ మీడియాపై జాగ్రత్తగా ఉండాలని, మహిళల భద్రత కోసం షీటీం అందుబాటులో ఉంటుందన్నారు. మండల విద్యాధికారి నాగేశ్వర్రావు, షీటీం సభ్యులు అనీల్, సాయిలు ఉన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి