
హుండీ ఆదాయం లెక్కింపు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యాక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి ఆలయ హుండీ ఆదాయాన్ని సహాయ కమిషనర్ విజయరామారావు, ఈవో ప్రభుగుప్తా ఆధ్వర్యంలో శనివారం లెక్కించారు. రూ.2,72,759 నగదుతోపాటు మిశ్రమ బంగారం,చ వెండి కానుకలను భక్తులు హుండీలో వేశారని సహాయ కమిషనర్ తెలిపారు. వేశారు. అర్చకులు శ్రీనివాస్శర్మ, వంశీశర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్, భక్తులు పాల్గొన్నారు.
28న జొన్న కొనుగోలు
కేంద్రాల మూసివేత
కామారెడ్డి క్రైం: జిల్లాలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ఈ నెల 28వ తేదీన మూసివేయనున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 24 జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 10,999 మంది రైతుల నుంచి 28,498 మెట్రిక్ టన్నుల జొన్నలను సేకరించామని పేర్కొన్నారు. జొన్నల కొనుగోలుకు ఈ నెల 28 ఆఖరి తేదీ అని, మిగిలిపోయిన రైతులు తమ జొన్నలను 27వ తేదీలోగా కేంద్రాలకు తీసుకురావాలని స్పష్టం చేశారు.
రెట్టింపు ఉత్సాహంతో సేవలు అందించాలి
కామారెడ్డి క్రైం: పదోన్నతి పొందిన పోలీసు అధికారులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. రాజంపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సంజీవులు ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ఈసందర్భంగా శనివారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన సంజీవులుకు ఆయన పదోన్నతి చిహ్నాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి బాధ్యతలను పెంచుతుందన్నారు. క్రమశిక్షణ, నిబద్దతతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

హుండీ ఆదాయం లెక్కింపు