
నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’
రుద్రూర్: నేరాల నియంత్రణ కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో శనివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సెర్చ్) నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు చూపని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. స్థానికంగా అనుమానితులు, అపరిచితులు ఉంటే పోలీస్టేషన్కు సమాచారం అందించాలన్నారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు తీసుకువస్తే వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. బోధన్, రుద్రూర్ సీఐలు కృష్ణ, వెంకట నారాయణ, ఎస్సైలు సాయన్న, మహేష్, సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.
అనుమానితులు ఉంటే సమాచారం ఇవ్వండి
ఖలీల్వాడి: స్థానికంగా అనుమానితులు, అపరిచితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఒకటో టౌన్ పోలీసులు తెలిపారు. నగరంలోని హబీబ్నగర్, కొజ్జాకాలనీ, మాలపల్లిలో శనివారం వారు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. కాలనీలో అనుమానితులను తనిఖీలు చేయడంతోపాటు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. కాలనీలోకి కొత్తగా వచ్చిన వారు, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. రాత్రివేళ్లలో వాహనాలపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.