
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్
బిక్కనూరు: మండలంలోని అంతంపల్లి గ్రామంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. టిప్పర్ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగి, వైర్లు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలు ఇలా.. ఓ టిప్పర్ లక్ష్మీదేవునిపల్లి నుంచి అంతంపల్లి గ్రామం ద్వారా హైవే పైకి బయలుదేరింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతో గ్రామంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో స్తంభం విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పెద్ద ఎత్తున మిరుగులు రావడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
ట్రాక్టర్ పట్టివేత
సిరికొండ: సిరికొండ రేంజ్ పరిధిలోని అటవీ భూమిలో అక్రమంగా పొదలను తొలగిస్తుండగా ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎఫ్ఆర్వో రవీందర్ శనివారం తెలిపారు. జినిగ్యాల తండాకు చెందిన సవాయిలాల్ అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తెలిపారు. అక్రమంగా అటవీ భూమిలో పొదలు తొలగిస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్