
● పేట్సంగెం బడిలో వేసవి ప్రత్యేక శిబిరం ● పద్నాలుగేళ్ల
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చదువే కాదు ఆటలు కూడా బతుకుబాట చూపుతాయని విశ్వసించే లక్ష్మణ్ రాథోడ్ గ్రామీణ క్రీడాకారులకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. స్వతహాగా క్రీడాకారుడైన లక్ష్మణ్ రాథోడ్ గాంధారి మండలం పేట్సంగెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ నిత్యం విద్యార్థులను క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తుంటారు. పాఠశాలకు సెలవులు ఉన్నా సరే తాను మాత్రం బడికి వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిందే. ఆయన దగ్గర ఆటల్లో నైపుణ్యాన్ని నేర్చుకున్న విద్యార్థులెందరో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వేసవి సెలవుల సమయంలో గ్రామీణ విద్యార్థులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక్కోచోట ఒక్కో క్రీడాంశాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగా పేట్సంగెం ఉన్నత పాఠశాలలో వాలీబాల్ ఆటకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పిల్లలకు వాలీబాల్ ఒక్కటే కాదు కబడ్డీ, అథ్లెటిక్స్లోనూ లక్ష్మణ్రాథోడ్ శిక్షణ ఇస్తున్నారు. గడిచిన 14 ఏళ్లుగా ఆయన వేసవి ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ విద్యార్థులను క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు. గాంధారి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పేట్సంగెం ఉన్నత పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆదివారం రోజున ఐదు కిలోమీటర్ల రన్నింగ్ కూడా చేయిస్తున్నారు. ప్రతి రోజూ ఫిట్నెస్, డ్రిల్, వాలీబాల్ ఆటలో టెక్నిక్స్, సర్వ్, డిఫెన్స్, అలాక్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అలాగే లక్ష్మణ్రాథోడ్ తన సోదరుడి పేరుతో ఏర్పాటు చేసిన బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు ఆటవస్తువులు సమకూరుస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆయా క్రీడాల్లో శిక్షణ పొందుతూ రాణిస్తున్నారు.
కర్తవ్య నిర్వహణలో మనం ఎలా మసులుకునే విధానంపై ఆ నాడు లక్ష్మణుడు దిశానిర్దేశం చేయగా ఈనాటి లక్ష్మణుడు చేసి చూపుతున్నాడు. క్రీడల్లో ఎంతో మంది క్రీడాకారులను మెరికల్లా తీర్చిదిద్దుతున్న ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణ్రాథోడ్పై ‘సాక్షి’ సండే స్పెషల్..

● పేట్సంగెం బడిలో వేసవి ప్రత్యేక శిబిరం ● పద్నాలుగేళ్ల

● పేట్సంగెం బడిలో వేసవి ప్రత్యేక శిబిరం ● పద్నాలుగేళ్ల