
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు
బాన్సువాడ : గుర్తింపు లేని పాఠశాలలపై చ ర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి రాజు అన్నారు. శనివారం పట్టణంలో ఆయ న మాట్లాడుతూ.. బాన్సువాడలో కొన్ని పా ఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే ప్ర చారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చే ర్పించొద్దని తల్లిదండ్రులకు సూచించారు. అ నుమతి లేకుండా ప్రచారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. ఆయనవెంట మండల విద్యాధికారి నాగేశ్వర్రావు ఉన్నారు.
స్వచ్ఛందంగా
రక్తదానం చేయాలి
కామారెడ్డి అర్బన్ : తలసేమియాతో బాధప డే చిన్నారుల కోసం రక్తదానం చేసేందుకు యువతీయువకులు స్వచ్ఛందంగా ముందు కు రావాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. త లసేమియా బాధిత చిన్నారుల కోసం ఈ నెల 26వ తేదీన లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద, ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య ఆస్పత్రి (కామారెడ్డి)లో నిర్వహించనున్న రక్తదాన శి బిరానికి సంబంధించిన కరప్రతాలను ఏఎ స్పీ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, లయన్స్ అధ్యక్షుడు చి లువేరి మారుతి, కామారెడ్డి రక్తదాతల స మూహం అధ్యక్షుడు జమీల్ హైమద్, ఉపా ధ్యక్షుడు వెంకటరమణ పాల్గొన్నారు.
లోక్ అదాలత్ను సద్వినియోగం
చేసుకోవాలి
బిచ్కుంద(జుక్కల్) : లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వినిల్కుమార్ అన్నారు. జూన్ 14వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్న నేప థ్యంలో కోర్టు హాలులో శనివారం బిచ్కుంద, జుక్కల్, పెద్దకొడప్గల్, ఎకై ్సజ్ ఎస్సైల తో సమావేశం నిర్వహించారు. కక్షిదారులు రాజీపడి కేసులు పరిష్కరించుకునే చక్కటి అవకాశం లోక్అదాలత్ ద్వారా కలుగుతుందన్నారు. పొలీసులు ఇరువర్గాలతో మాట్లా డి అవగాహన కల్పించాలని సూచించారు.
గోవులను తరలించకుండా
చర్యలు చేపట్టాలి
భిక్కనూరు: గోవులను అక్రమంగా తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భాస్కరన్ సూ చించారు. మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద పోలీస్, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును శనివారం ఆయన సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాల్లో అక్రమంగా గోవులను తరలిస్తే వెంటనే వాటిని గోశాలలకు తరలించాలన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఆయన వెంట పశుసంవర్ధక శాఖ ఏడీ శ్రీనివాస్, మండల పశువైద్యాధికారి దేవేందర్, పోలీసులున్నారు.
విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలి
కామారెడ్డి అర్బన్ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, వ్యవసాయ బావులు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు అత్యంత జాగ్రత వహించాలని విద్యుత్ సంస్థ ఎస్ఈ శ్రావణ్కుమార్ కోరారు. తెగిపడి న, వేలాడుతున్న, వదులుగా ఉన్న, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దని, అలాగే ఇళ్లలో దుస్తులు ఆరేసేందుకు ఇనుప వైర్లకు బదులుగా ప్లాస్టిక్ వైర్లను కట్టుకోవాల ని ఎస్ఈ సూచించారు. సెల్ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రతగా ఉండాలన్నా రు. ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంటల రక్షణకు విద్యుత్ కంచెల ఏర్పాటు అత్యంత ప్రమాదకరమని, వాటి కారణంగా మూగజీవాలు, రైతులు మృత్యువాత పడుతున్నారని హెచ్చరించా రు. విద్యుత్కు సంబంధించి ఎలాంటి సమ స్యలున్నా 1912 నంబర్కు ఫోన్చేసి తెలపాలని ఎస్ఈ సూచించారు.

గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు

గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు

గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు