పిట్లం ఏఎస్సై లింబాద్రికి ఎస్సైగా పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

పిట్లం ఏఎస్సై లింబాద్రికి ఎస్సైగా పదోన్నతి

May 24 2025 1:17 AM | Updated on May 24 2025 1:17 AM

పిట్లం ఏఎస్సై  లింబాద్రికి ఎస్సైగా పదోన్నతి

పిట్లం ఏఎస్సై లింబాద్రికి ఎస్సైగా పదోన్నతి

పిట్లం(జుక్కల్‌): స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లింబాద్రికి ఎస్సై గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా బాన్సువాడలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి డీఎస్పీ విఠల్‌రెడ్డి లింబాద్రికి పదోన్నతి చిహ్నాన్ని అలకరించి అభినందనలు తెలిపారు. లింబాద్రికి పదోన్నతి లభించడంతో తోటి సిబ్బందిశుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాజేశ్‌ పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌అర్బన్‌: ఇంటర్‌ సప్లిమెంటరీ ఇంగ్లిష్‌ ఫస్టియర్‌ పరీక్షలు శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈవో రవికుమార్‌ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 1,867 మంది హాజరు కాగా 245 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,431మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి ఏడు పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు ఆరు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు 12 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement