
బ్రిడ్జి నిర్మించారు.. బీటీ రోడ్డు మరిచారు
రాజంపేట : మండలంలోని కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల పరిధిలో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఒక్కో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.43 కోట్లను కేటాయించారు. బ్రిడ్జీల నిర్మాణ పనులు పూర్తయినా బీటీ రోడ్డు వేయకుండా వదిలేశారు. దీంతో కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం జిల్లాకేంద్రం వెళ్లడానికి, పక్కనే మెదక్ జిల్లాకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదాలు జరిగినా..
మండలంలోని అన్నారంనికి వెళ్లే మార్గంలో నూతన బ్రిడ్జి నిర్మించి బీటీ రోడ్డు వేయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నా రు. బ్రిడ్జి వద్ద మరమ్మతులు చేయపోవడంతో ఆచోట మట్టి కృంగింది. నాలుగు నెలల క్రితం ఓ కారు అదుపు త ప్పి బోల్తా పడింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రిడ్జి వద్ద బీటీ రోడ్డు వేయాలని ఆయా గ్రా మాల పరిధి ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
రాజంపేట మండలంలో
చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
బీటీ రోడ్డు పనులు చేపట్టాలి
నూతన బ్రిడ్జీల వద్ద బీటీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలి. వర్షాలకు మట్టి కృంగిపోవడంతో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం సమీపిస్తుండటంతో బ్రిడ్జి వద్ద మట్టి కృంగిపోతుంది అధికారులు స్పందించి పనులు ప్రారంభించాలి. – శ్రీనివాస్, ఎల్లారెడ్డిపల్లి తండా
నిధులు విడుదల కాకపోవడంతోనే..
నూతన బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్లకు సకాలంలో నిధలు విడుదల కాకపోవడంతోనే బ్రిడ్జిల వద్ద పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే పనులు పూర్తిచేసి బీటి రోడ్డు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను ఆదేశిస్తా.
– ఆర్అండ్బీ డీఈఈ, శ్రీనివాస్, ఎల్లారెడ్డి

బ్రిడ్జి నిర్మించారు.. బీటీ రోడ్డు మరిచారు