
ఆర్అండ్బీ రోడ్డు, డ్రెయినేజీ ఆక్రమణ
బిచ్కుంద(జుక్కల్) : మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం అధికారులు రెండు వైపు లా రోడ్డు తవ్వి మురికి కాలువలు నిర్మించి రో డ్డును వెడల్పు చేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న పలు షట్టర్ల యజమానులు తమ ముందు ఉన్న ఆర్అండ్బీ స్థలం, మురుగు కాలువ ఆక్రమించి షాపులను ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు. ఏబీఐ బ్యాంక్ ముందు తారురోడ్డు కు అనుకొని చికెన్ సెంటర్లు ఇతర దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డుకు అనుకొని 30 నుంచి 40 చదరపు అడుగుల స్థలం ఆక్రమించడంతో అక్కడ రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అక్కడ తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా రోడ్డుపై మురుగు నిలువడంతో స్థా నికులు ఇబ్బందులు పడుతున్నారు. యథేచ్ఛ గా ఆక్రమణలు జరుగుతున్నా ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేద ని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో న్యా యవాదులు చికెన్ సెంటర్లు తొలగించాలని ఫిర్యాదు చేశారు. చికెన్ సెంటర్లను మాంసం విక్రయించే మార్కెట్కు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆక్రమణలు తొలగిస్తాం
మురికి కాలువలు, రోడ్డును ఆక్రమించి వేసిన దుకాణాలను వెంటనే తొలగిస్తాం. మండల ఎంపీవో, జీపీ కార్యదర్శి పరిశీలించి సమస్య పరిష్కరిస్తారు. మురుగు రోడ్డుపై ని లువకుండా మట్టి తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తాం. – మురళి, డీపీవో, కామారెడ్డి
బిచ్కుందలో రోడ్డుపై
నిలుస్తున్న మురుగునీరు
ఇబ్బందులు పడుతున్న
వాహనదారులు

ఆర్అండ్బీ రోడ్డు, డ్రెయినేజీ ఆక్రమణ