
సెకండియర్ ఎగ్జామ్కు ఏక్నిరంజన్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ద్వితీయ సంవత్సరం పరీక్షను ఒక్కే ఒక్క విద్యార్థి పరీక్ష రాశాడు. అయితే ఇక్కడ ఆరుగురు అధికారులు ఎగ్జామినేషన్ విధులు నిర్వర్తించారు. ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలకు 32మందికి గాను 30మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండీయర్ పరీక్ష కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే రాశాడు. అయితే పరీక్ష నిర్వాహాణ కోసం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారు.