
ఆపరేషన్ కగార్ హత్యాకాండ
కామారెడ్డి టౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో హత్యాకాండ కొనసాగిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మఢ్ అడవుల్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27 మందికిపైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆరోపించారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరిందని, ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరాం నాయక్, కొత్త నర్సింలు తదితరులు పాల్గొన్నారు.