
‘సాగర్’ వరద గేట్ల పరిశీలన
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు వరద గేట్లు వాటి గేర్ బాక్సులను క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణ, జిల్లా నీటిపారుదలశాఖ సీఈ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ‘ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ గాలికి!’ శీర్షికన ఈ నెల 19వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును వారు సందర్శించి వరద గేట్లు, గేర్ బాక్స్లు, రోప్ల స్థితిగతులను తెలుసుకున్నారు. 20 గేట్లకు ఒరాలింగ్ పనులతోపాటు మిగతా గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనులు చేపట్టాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వారి వెంట నీటిపారుదలశాఖ ఈఈ సోలోమాన్, క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈ భూమారెడ్డి, ఏఈ శివప్రసాద్ తదితరులు ఉన్నారు.

‘సాగర్’ వరద గేట్ల పరిశీలన