ప్రాణహిత– చేవెళ్ల పథకం వైఎస్సార్‌ కల | - | Sakshi
Sakshi News home page

ప్రాణహిత– చేవెళ్ల పథకం వైఎస్సార్‌ కల

May 5 2025 8:01 PM | Updated on May 5 2025 8:01 PM

ప్రాణహిత– చేవెళ్ల పథకం వైఎస్సార్‌ కల

ప్రాణహిత– చేవెళ్ల పథకం వైఎస్సార్‌ కల

భిక్కనూరు: కోనసీమ జిల్లాల మాదిరిగా తెలంగాణలో కూడా రైతులు మూడు పంటలు పండించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని ప్రారంభించాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. ప్రాణహిత– చేవెళ్ల పథకానికి ప్రభుత్వం రూ. 23 కోట్ల 15 లక్షలను మంజూరు చేయడానికి కృషి చేసిన షబ్బీర్‌అలీని భిక్కనూరు,దోమకొండ కాంగ్రెస్‌ నేతలు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ప్రాణహిత–చేవెళ్ల పూర్తి చేయాలని వైఎస్సార్‌ కలలు కన్నాడన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల అధికారంలో ఏ మాత్రం నిధులను మంజూరు చేసిన పాపన పోలేదన్నారు.22,23 ప్యాకేజీలను పూర్తి చేయించి రైతులు మూడు పంటలు పండించే విధంగా కృషిచేస్తానన్నారు. మరో 200 కోట్లు ఈ పథకానికి అవసరమతాయన్నారు. ఈ నిధులను మంజూరు చేయించేందుకు కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్‌, దోమకొండల మండల అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, విండో చైర్మన్‌ గంగళ్ల భూమయ్య, నేతలు శ్రీరాం వెంకటేశ్‌, నీల అంజయ్య, లింబాద్రి, దుంపల మోహన్‌రెడ్డి, అందె దయాకర్‌రెడ్డి, నర్మల రాంచంద్రం, శ్రీకాంత్‌, రమేష్‌ , సలీం తదితరులు పాల్గొన్నారు.

22, 23వ ప్యాకేజీలను పూర్తి చేయిస్తాం

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement