విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి

May 27 2025 1:13 AM | Updated on May 27 2025 1:13 AM

విత్త

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి

కామారెడ్డి రూరల్‌: విత్తనాలు కొనుగోలు చే సే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్‌ సూచించారు. ఈ విషయ మై ఆయన సోమవారం ఒక ప్రకటన విడు దల చేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్‌ తీసుకోవాలని పేర్కొన్నారు. అధీకృత లైసెన్స్‌ కలిగిన డీలర్‌ నుంచే విత్తనాలు కొనాలని సూచించారు. పంటకాలం ముగిసే వరకు బిల్‌ను భద్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నా రు. బిల్‌లో తప్పనిసరిగా విత్తన కంపెనీ పేరు, విత్తనం రకం, బ్యాచ్‌ నంబర్‌, లాట్‌ నంబర్‌, ఖరీదు వివరాలు ఉన్నాయో లేవో చెక్‌ చేసుకోవాలని సూచించారు. ప్యాకెట్స్‌పై తప్పనిసరిగా తయారైన తేది, కాలం ముగి సిన తేది ఉండాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై 89777 46219 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల రెండో, నాలుగో సెమిస్టర్‌(రెగ్యులర్‌), ఒకటో, మూడో(బ్యాక్‌లాగ్‌) సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి సంపత్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఐదుగురు విద్యార్థులు పది జీపీఏ, 50 మంది 9.5 జీపీఏ, 25 మంది 9 జీపీఏ సాధించారని ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అదనపు పరీక్షల నియంత్రణ అధికారి శాంతాబాయి, వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య, అధ్యాపకులు రాములు, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక

కామారెడ్డి అర్బన్‌: సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో వచ్చేనెల ఒకటో తేదీనుంచి నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్‌ అండర్‌–8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీలలో పాల్గొనే జిల్లా క్రీడాకారులను సోమవారం ఎంపిక చేశారు. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. 110 మంది క్రీడాకారులు పాల్గొనగా ఒక్కో విభాగంనుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన 24 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారికి పతకాలు, ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌, ప్రతినిధులు నవీన్‌కుమార్‌, శివాగౌడ్‌, నరే ష్‌, నరేష్‌రెడ్డి, శ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి, మల్లేష్‌, నవీన్‌, సురేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎంపికై ంది వీరే..

శ్రీహన్‌, టి.శ్రేయాస్‌, కే.సాయి సిద్ధార్థ్‌, ఆర్‌.శ్రద్ధ,ఎ.సాయిశ్రేష్ట, సి.కార్తికేయ, ఎం.సుశాంక్‌, కే.కార్తికేయ, వి.మంజుల, బి.నిశిగ్నా, ఎం.శరణ్య, బి.స్నితిక, బి.సిద్ధు, బి.చైతన్య, పి.వరుణ్‌, ఎం.విహన్‌రెడ్డి, పి.నిర్‌విల్‌, ఎం. భార్గవ్‌రెడ్డి, డి.సాత్విక, పి.పోచవ్వ, బి.స్నే హిత, డి.గీతం, బి.రితిక, ఎం.సాయిప్రియ.

ఇంట్లో నుంచి పారిపోయిన బాలుడు

● స్థానికుల సహకారంతో గుర్తించిన పోలీసులు

కామారెడ్డి క్రైం: అల్లరి చేస్తున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి బయటకు పారిపోయాడు ఓ బాలుడు. స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఓ చోట బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్‌ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిల్లాలవారి కృష్ణమూర్తి కొడుకు విశ్వేశ్వర చారి (12) తల్లిదండ్రులు తిట్టారని ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి ఎస్సై రాజు సిబ్బంది, స్థానికుల సహకారంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు నాలుగు గంటలపా టు గాలింపు చర్యలు చేపట్టి పట్టణంలో ఓచోట బాలుడి ఆచూకీ గుర్తించారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విత్తనాల కొనుగోలులో రైతులు  జాగ్రత్తలు పాటించాలి 
1
1/1

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement