
నర్సింగ్ పరీక్షలకు 453 మంది హాజరు
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)లో బీఎస్సీ నర్సింగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 10వ తేదీ వరకూ జరగనున్న ఈ పరీక్షలకు తొలి రోజు 493 మందికి గాను 453 మంది హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడితే తక్షణమే డిబార్ చేస్తామని హెచ్చరించారు. పరీక్షలకు అబ్జర్వర్గా డాక్టర్ లావణ్య, చీఫ్ సూపరింటెండెంట్గా వైస్ ప్రిన్సిపాల్ (అకడమిక్స్) డాక్టర్ శశి, అదనపు చీఫ్ సూపరింటెండెంట్గా ఫార్మకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ వ్యవహరించారు. ఆర్ఎంసీ ఎగ్జామినేషన్ భవంతిలో ఉన్న మూడు హాళ్లలో నిర్వహించిన ఈ పరీక్షలకు 18 మంది వైద్యులు ఇన్విజిలేటర్లుగా పని చేశారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం ఆదేశాల మేరకు ఎటువంటి కాపీయింగ్కి తావివ్వకుండా పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎగ్జామినేషన్ హాల్ పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉందన్నారు. విద్యార్థులు అసంబద్ధ ప్రయత్నాలకు పాల్పడి విద్యా సంవత్సరాన్ని నష్టపోవద్దని సూచించారు.