ప్రభుత్వం టైలర్స్ను పట్టించుకోవడం లేదు
బోట్క్లబ్ (కాకినాడ): రాష్ట్ర ప్రభుత్వం టైలర్స్ను పట్టించుకోవడం లేదని ఏపీ టైలర్స్ కో– ఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి బీఎన్ఎస్ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జగన్నాథపురంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.కోటి మూలధనంతో టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గ్రామస్థాయిలో టైలరింగ్ సొసైటీలు ఏర్పాటు చేసి చేనేత జౌళిశాఖకు అప్పగించారన్నారు. అప్పటిలో 300 సొసైటీలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. పాదయాత్ర సమయంలో టైలర్స్ బాధలు స్వయంగా తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతీ ఏడాది ఆర్థిక సహాయం చేసేవారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టైలర్స్ను అసలు పట్టించుకోవడం లేదన్నారు. కులవృత్తులకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రభుత్వం టైలర్స్ని పరిగణలోనికి తీసుకోలేదన్నారు. 145 కులవృత్తులను పరిగణలోనికి తీసుకొని టైలర్స్ను పక్కన పెట్టడం చాలా దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పరోక్షంగా ఈ టైలరింగ్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం మా టైలర్స్ న్యాయం చేయాలని కోరారు. కుల వృత్తుల్లో భాగంగా మాకు కావాల్సిన టైలరింగ్ మెషీన్లు ఇవ్వాలన్నారు.
ఐదుగురికి గాయాలు
జగ్గంపేట: జగ్గంపేట గ్రామ పరిధిలోని జాతీయ రహదారి 16 బ్రిడ్జిపై సోమవారం మోటారు సైకిల్, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్దారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న మోటారు సైకిలిస్టు బ్రేక్ వేయడంతో అతని వెనుకాల వస్తున్న ఆటో అతన్ని ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఆటో బ్రిడ్జి గోడను ఢీకొని పక్కకు ఒరిగిపోయిది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక సీహెచ్సీకి తరలించారు.
ప్రమాద స్థలిలో గాయపడ్డ ప్రయాణికులు
మోటారు సైకిల్, ఆటో ఢీ