10 కేజీల వెండి సమర్పణ | - | Sakshi
Sakshi News home page

10 కేజీల వెండి సమర్పణ

Mar 18 2025 12:25 AM | Updated on Mar 18 2025 12:24 AM

కాకినాడ రూరల్‌: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయానికి దాత సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు సోమవారం 10 కిలోల వెండి సమర్పించారు. దీనితో మూల భావనారాయణ స్వామి వారికి మకర తోరణం తయారు చేయించాలని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణను కోరారు. ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు.

రూ.లక్ష విరాళం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): స్థానిక శాంతినగర్‌లోని శ్రీరామకృష్ణా సేవా సమితికి ముత్తా రామన్న సత్రం ఫౌండర్‌ ట్రస్టీలు డాక్టర్‌ ముత్తా వెంకటేష్‌, ముత్తా ప్రసాద్‌బాబు సోమవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని సమితి అధ్యక్షుడు విఎల్‌ గాంధీ, కార్యదర్శి కె.సతీష్‌, ఉపాధ్యక్షుడు వక్కలంక రామకృష్ణకు అందజేశారు.

యూట్యూబ్‌ చానల్‌పై కేసు

అన్నవరం: సత్యదేవుని మూలవిరాట్‌ ఫొటో ప్రసారం చేసిన ఓ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులపై అన్నవరం దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీహరిబాబు సోమవారం తెలిపారు. రత్నగిరిపై గర్భాలయంలోని స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్‌ల ఫొటోలు తీయడం నిషేధం. అందువల్లనే అధికారుల అనుమతి లేకుండా కెమెరాలను, సెల్‌ఫోన్లను ఆలయం లోపలకు అనుమతించరు. అయితే ‘మా ఇంటి భాగవతం’ యూట్యూబ్‌ చానల్‌ స్వామివారి మూలవిరాట్‌ ఫొటో తీసి ప్రసారం చేసింది. ఆ ఫొటోను తొలగించాలని దేవస్థానం అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ చానల్‌ నిర్వాహకులపై పోలీసులకు దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు.

పీజీఆర్‌ఎస్‌కు 404 అర్జీలు

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో 404 మంది వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ షణ్మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, హౌసింగ్‌ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్‌ఈజెడ్‌ ఎస్‌డీసీ కేవీ రామలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ వేదిక వద్ద ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పండ్లను ఉంచారు.

సుబ్బాలమ్మ తల్లికి రూ.26

లక్షలతో వెండి మకర తోరణం

అమలాపురం టౌన్‌: పట్టణ దేవత సుబ్బాలమ్మ అమ్మవారికి పలువురు భక్తులు రూ.26 లక్షల విలువైన 26 కిలోల వెండి మకర తోరణాన్ని సోమవారం సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, భక్తులు ఈ మకర తోరణాన్ని ఉదయం అంతా ఆలయం వద్ద ప్రదర్శనగా ఉంచి, పూజలు చేశారు. సాయంత్రం రెండు అశ్వాల రథంపై దీనిని ఉంచి అత్యంత వైభవంగా ఊరేగించారు. అమ్మవారి జన్మదినం, దేవస్థానం సప్తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వెండి మకర తోరణాన్ని అమ్మవారి వద్ద అలంకరించారు.

10 కేజీల వెండి సమర్పణ 1
1/3

10 కేజీల వెండి సమర్పణ

10 కేజీల వెండి సమర్పణ 2
2/3

10 కేజీల వెండి సమర్పణ

10 కేజీల వెండి సమర్పణ 3
3/3

10 కేజీల వెండి సమర్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement