
సహజ వనరుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు
అమలాపురం టౌన్: సహజ వనరులు, ప్రకృతి సహజ సంపద పరిరక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటైంది. గ్యాస్, చమురు, ఖనిజ, ప్రకృతి వనరుల పరిరక్షణ సమితి ఈ జిల్లా కమిటీని నియమించింది. జిల్లా నూతన కమిటీని సమితి కన్వీనర్, ఏపీ రైతు సంఘం జిల్లా కో–ఆర్డినేటర్ కె.సత్తిబాబుతో పాటు, ప్రతినిధులు స్థానిక ప్రెస్ క్లబ్లో భవనంలో సోమవారం సాయంత్రం ప్రకటించారు. కమిటీ జిల్లా కన్వీనర్గా ఉండవిల్లి గోపాలరావు, కో–కన్వీనర్లుగా గండి ఏసుదాసు, జాలెం సుబ్బారావు, సభ్యులుగా రాపాక రత్నరాజు, ఒంటెద్దు వెంకన్నాయుడు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బండారు రామమోహనరావు, దేవ రాజేంద్రప్రసాద్, పులపర్తి సురేష్ నియమితులయ్యారు. జిల్లాలోని సహజ వనరు లు ప్రజల ఆస్తి యాజమాన్య హక్కుగా ఉండాలని నూతన కమిటీ సమవేశం తీర్మానించింది. పలు అంశాలపై చర్చించి, వాటి కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది.