ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు? | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు?

Mar 16 2025 12:08 AM | Updated on Mar 16 2025 12:08 AM

ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు?

ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు?

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ‘గతంలో టన్ను ఇసుక ధర రూ.475 ఉంది. ఏజెన్సీలు రూ.229కి కోట్‌ చేశాయి. కానీ, ఇప్పటికీ రూ.400కు పైగా అమ్ముతున్నారు. దీనికి కారణమేమిటి?’ అని మైన్స్‌ కమిషనర్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ఇసుక సరఫరా ఏజెన్సీలు సాధ్యం కాని ధర ప్రతిపాదించి, ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నాయని నిలదీశారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన డీఎల్‌ఎస్‌ఏ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇదే తీరు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై నిర్వహించే సమావేశానికి ఓపెన్‌, డీసిల్టేషన్‌ ఏజెన్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. జరిగిన తప్పులు సరిచేసుకోవాలని, ఇకపై రీచ్‌లలో ప్రభుత్వ సిబ్బందిని కూడా నియమిస్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. వినియోగదారులతో నేరుగా సంభాషిస్తామన్నారు. మొదట వచ్చిన వారికి మొదట ఇసుక అందించేలా రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. రవాణా వ్యవస్థపై పర్యవేక్షణ తప్పనిసరని ప్రవీణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్‌, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, మైన్స్‌ ఈడీ డి.ఫణిభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement