
హామీలు అమలు చేయని చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, తొమ్మిది నెలలైయినప్పటికీ ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి, భవన నిర్మాణాలు చేపట్టి, నాలుగు కాలేజీలు ప్రారంభించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా తన మనుషులకు అప్పగించేలా చంద్రబాబు ప్రయత్నించడాన్ని వైఎస్సార్ సీపీ తరఫున నిరసిస్తున్నాం. ఎకరం రూపాయి చొప్పున 33 సంవత్సరాలకు కట్టబెట్టేలా వారి ఆలోచనలున్నాయి. కళాశాలకు 50 నుంచి 60 ఎకరాల భూమి చూసుకున్నా.. ఒక్కొక్కటి రూ.1,000 కోట్ల విలువ చేస్తుంది. 17 మెడికల్ కళాశాలలంటే రూ.17 వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తి. దీనిని తన మనుషులకు ధారాదత్తం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువా త ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వారిని ఆదుకోవాలి.
– దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
హామీలు నెరవేర్చాల్సిందే..
అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఇప్పటి వరకూ ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో 2014 నుంచి 2019 వరకూ వాళ్లే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు. కలిసి పని చేస్తున్నారు. కొంత మందిని కేంద్ర మంత్రులుగా కూడా తీసుకున్నారు. వాళ్లు తేలేనిది మేం తెచ్చాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంతో కలిసి లేము, పోరాడాము. నేను కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు ప్రస్తావించా. 2024 ఎన్నికల ముందు అన్ని విద్యా సంస్థలకు పెండింగ్ నిధులన్నీ అందజేశాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాతే ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం నిధులు విడుదల చేయలేదు. ఆ నిధులు అలాగే ఉన్నాయి. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్టు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటాం. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి నిధులు వెంటనే ఇవ్వాలి. ఉద్యోగ కేలండర్ విడుదల చేయాలి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తక్షణం నిలుపు చేయాలి.
– వంగా గీత, కాకినాడ మాజీ ఎంపీ

హామీలు అమలు చేయని చంద్రబాబు