అథ్లెటిక్స్‌కు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌కు విద్యార్థుల ఎంపిక

Dec 11 2023 2:02 AM | Updated on Dec 11 2023 2:02 AM

క్రాస్‌కంట్రీ పోటీలకు ఎంపికై న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు  - Sakshi

క్రాస్‌కంట్రీ పోటీలకు ఎంపికై న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జేఎన్టీయూ క్రీడా మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలను అథ్లెటిక్స్‌ సంఘ అధ్యక్షుడు టీవీఎస్‌ రంగారావు, డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌ ప్రారంభించారు. అండర్‌–14, 16 విభాగాల్లో బాలురు, బాలికలకు 10, 8, 6, 2 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ ఎంపికలకు 250 మంది హాజరుకాగా 30 మందిని క్రాస్‌కంట్రీ పోటీలకు ఎంపిక చేశామని సంఘ కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. అదేవిధంగా నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ పోటీలకు 13 మంది ఎంపికయ్యారన్నారు. ఈ ఎంపికల నిర్వహణలో పీడీలు బంగార్రాజు, నూకరాజు, గోవిందు, గిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement