ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

Dec 11 2023 2:02 AM | Updated on Dec 11 2023 2:02 AM

నిడదవోలు: స్థానిక రైల్వేస్టేషన్‌ సెంటర్‌లోని ఎస్‌ఆర్‌ లాడ్జిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు చెందిన పొన్నాడ భరణీకుమార్‌ (33) ఈ నెల 9న మధ్యాహ్నం లాడ్జిలో దిగాడు. ఆదివారం తెల్లవారుజామున అతను ఉన్న గదికి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది చూసేసరికి ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఉండటం గమనించారు. లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పట్టణ ఎస్సై పి.నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు భరణీకుమార్‌ అత్తారిల్లు నిడదవోలు పట్టణంగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement