పుష్కరిణిలో స్నానాలు..... | - | Sakshi
Sakshi News home page

Mar 4 2023 7:16 AM | Updated on Mar 4 2023 7:16 AM

- - Sakshi

పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

గండేపల్లి: మండలంలోని తాళ్లూరు జియ్యన్న మఠం గోవింద నామస్మరణతో మార్మోగింది. తాళ్లూరు మఠంలో వేంచేసిన వేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచి ఆలయ ప్రాంగణంలోని గజేంద్ర మోక్ష పుష్కరిణిలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు సాలగ్రామ దానాలు చేసి, తర్పణాలు వదిలారు. గ్రామంలోని దారులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలు ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు.

తాళ్లూరులో స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు1
1/1

తాళ్లూరులో స్వామి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement