అమరుల త్యాగం అజరామరం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగం అజరామరం

Oct 23 2025 2:27 AM | Updated on Oct 23 2025 2:27 AM

అమరుల త్యాగం అజరామరం

అమరుల త్యాగం అజరామరం

గద్వాల క్రైం: పోలీసు అమరవీరుల త్యాగం అజరామరమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఎస్పీ పాల్గొని మా ట్లాడారు. పోలీసు ఫ్లాగ్‌ డే వారోత్సవాల సందర్భంగా బీచుపల్లి పదో బెటాలియన్‌, పోలీసు శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న పోలీసుల సేవలు త్యాగనిరతికి తార్కాణమని, విధుల్లో అమరులైన పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ నవ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు చేయూత ఇవ్వాలన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా పోలీసు ఉన్నాడనే ధైర్యంతో ప్రజ లు నమ్మకంగా ఉన్నారని, విపత్కర సమ యాల్లో బాధితులకు మనోధైర్యం ఇచ్చేది పోలీసులే అని అన్నారు. బైక్‌ ర్యాలీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతామనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బెటాలియన్‌ కమాండెంట్‌ జయరాజు, ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవి, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement