అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు | - | Sakshi
Sakshi News home page

అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

Aug 31 2025 12:45 AM | Updated on Aug 31 2025 12:45 AM

అరుణాచలం గిరి  ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు డిపో మేనేజర్‌ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి వచ్చే నెల 5న రాత్రి 7 గంటలకు బయలుదేరి మార్గమధ్యలో కాణిపాకం విగ్నేశ్వరుడి దర్శనానంతరం వేలూరులోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని 6న సాయంత్రం 4 గంటలకు అరుణాచలంకు చే రుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంత రం 7న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరి 8న ఉదయం మహబూబ్‌నగర్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఆర్టీసీ అందిస్తున్న టూర్‌ ప్యాకేజీని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ టూర్‌ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని, వివరాల కోసం సెల్‌ నంబర్లు 99592 26286, 94411 62588లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement