
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి వచ్చే నెల 5న రాత్రి 7 గంటలకు బయలుదేరి మార్గమధ్యలో కాణిపాకం విగ్నేశ్వరుడి దర్శనానంతరం వేలూరులోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని 6న సాయంత్రం 4 గంటలకు అరుణాచలంకు చే రుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంత రం 7న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరి 8న ఉదయం మహబూబ్నగర్కు చేరుకుంటుందని చెప్పారు. ఆర్టీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్సైట్ tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, వివరాల కోసం సెల్ నంబర్లు 99592 26286, 94411 62588లను సంప్రదించాలని సూచించారు.