అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Jul 9 2025 6:52 AM | Updated on Jul 9 2025 6:52 AM

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

మానవపాడు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని.. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని ఆర్డీఓ అలివేలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వడ్డేపల్లి, రాజోలి మండలాల బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఎవరి పేర్లు అయిన లేనట్‌లైతే వారి వద్ద నుంచి ఫాం–6 తీసుకొని నమోదు చేయాలని తెలిపారు. ఓటర్‌ జాబితాలో ఎవరి పేరు అయినా లేకపోతే తప్పనిసరిగా పొందుపర్చాలని, ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బీఎల్‌ఓలు విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జోషి శ్రీనివాస్‌శర్మ, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement