అలంపూర్‌ ఆలయాల్లో చండీహోమాలు | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌ ఆలయాల్లో చండీహోమాలు

Jun 26 2025 6:49 AM | Updated on Jun 26 2025 6:49 AM

అలంపూ

అలంపూర్‌ ఆలయాల్లో చండీహోమాలు

అలంపూర్‌: అలంపూర్‌ క్షేత్రంలో వెలసిన జోగుళాంబ అమ్మవారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని బుధవారం చండీహోమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు హోమాల్లో పాల్గొన్నట్లు ఈఓ పురేందర్‌కుమార్‌ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. ఇదిలాఉండగా, అమావాస్య నేపథ్యంలో ఆలయాలనికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు నిత్య అన్నదాన సత్రంలో అన్నదానం చేశారు.

బీచుపల్లిలో అమావాస్య పూజలు

ఎర్రవల్లి: అమావాస్య నేపథ్యంలో బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయం బుధవారం భక్తులతో రద్దీగా మారింది. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆకు పూజ, అభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈఓ రామన్‌గౌడ్‌, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

అలంపూర్‌ ఆలయాల్లో  చండీహోమాలు 1
1/1

అలంపూర్‌ ఆలయాల్లో చండీహోమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement