విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

Jun 26 2025 6:49 AM | Updated on Jun 26 2025 12:29 PM

మల్దకల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు అధ్యాపకులు మెరుగైన విద్యాబోధన చేసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని జి ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి హృదయరాజు సూచించారు. బుధవారం మల్దకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అధ్యాపకులు, విద్యార్థుల హాజరు రిజిష్ట్రర్‌లను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. 

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులు, కళాశాలకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. చదువుతోనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పని సరిగా చదివించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నర్సింహులు, అధ్యాపకులు రామాంజనేయులుగౌడ్‌, గోవర్దన్‌శేట్టి, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు స్థిర ఆదాయం అందేలా చర్యలు

కేటీదొడ్డి: ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు స్ధిర ఆదాయం అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మామిడి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలకు నీటి సరఫరా, తోటల నిర్వహణ, పని నాణ్యత తదితర అంశాలపై సమీక్షింరు. ప్రతి మొక్కపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టి రైతులకు దీర్గాకాలిక ఆదాయం అందేలా చూడాలని, ఉపాధి హామీ పథకం కేవలం ఉపాధి నిచ్చే కార్యక్రమంగా కాకుండా వ్యవసాయ ఆధారిత రైతుకు స్థిర ఆదాయ మార్గంగా మారలన్నదే ప్రభుత్వ ఉద్ధేశమని అని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించి పంటలతో పాటు ఉద్యాన పంటలు, తోటల అభివృద్ధి గ్రామీణ వనరులను వినియోగించుకోవాలని సూచించారు.

విద్యార్థులను  ఉన్నతంగా తీర్చిదిద్దాలి 1
1/1

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement