‘ఎమర్జెన్సీ’ ప్రజాస్వామ్యానికి మచ్చ | - | Sakshi
Sakshi News home page

‘ఎమర్జెన్సీ’ ప్రజాస్వామ్యానికి మచ్చ

Jun 26 2025 6:51 AM | Updated on Jun 26 2025 6:51 AM

‘ఎమర్జెన్సీ’ ప్రజాస్వామ్యానికి మచ్చ

‘ఎమర్జెన్సీ’ ప్రజాస్వామ్యానికి మచ్చ

గద్వాల: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అమలు చేస్తూ తీసుకున్న నియతృత్వ నిర్ణయం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1975 జూన్‌ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్సెన్సీ విధించారు. ఈనిర్ణయం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసహక్కులను కాలరాస్తూ నియతృత్వ పాలన సాగించారు. ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులను అరెస్టు చేయించడం, వార్తాపత్రికలపై నియంత్రణ, ఎన్నికల వాయిదా, ప్రభుత్వ వ్యతిరేకతను అణివేయడం వంటి చర్యలను చేపట్టారన్నారు. అనంతరం ఎమర్జెన్సీ విధించిన అప్పటి సన్నివేశాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించి వీక్షించారు. కార్యక్రమంలో నాయకులు రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవి, శివారెడ్డి, దేవదాస్‌, ఇసాక్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement