
నిమ్మతోట సాగు చేశా
ప్రభుత్వం పండ్ల తోటలను సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీని అందిస్తుందని చెప్పారు. నేను రెండు ఎకరాలు నిమ్మ తొటను సాగుచేసి ఆరు నెలలు అవుతోంది. ఇంతవరకు నాకు సబ్సిడీ అందజేయలేదు. రైతులకు సబ్సిడీ త్వరగా అందజేస్తే వెసులుబాటుగా ఉంటుంది.
– జగన్నాథ రెడ్డి, రైతు, అయిజ
సబ్సిడీ శాతం పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలు సాగుచేసే రైతులకు 40 శాతం సబ్సిడీని ప్రకటించింది. అయితే సబ్సిడీ శాతం 90కు పెంచితే అనేకమంది పేద రైతులు కూడా పండ్ల తోటలను సాగుచేస్తారు. రైతుకు మేలు చేకూరడంతో పాటు పర్యావరణం మెరుగుపడుతుంది.
– దర్శల్లి, రైతు, అయిజ
పండ్ల తోటలతో అనేక లాభాలు
రైతులు ప్రభుత్వం అందించే 40 శాతం సబ్సిడీని సద్వినియోగంచేసుకొని పండ్ల తోటలు సాగుచేస్తే అనేక లాభాలు పొందవచ్చు. తొటలు కాపుకు వచ్చినప్పటి నుంచి పండ్ల తోటల రకాలను బట్టి సుమారు 20 నుంచి 30 సంవత్సరా లవరకు పంట దిగుబడి వస్తుంది. కూలీల అవసరం చాలావరకు తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది.
– ఎంఏ అక్బర్ బాషా,
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
●

నిమ్మతోట సాగు చేశా